టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటన గురించి అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎంతోమంది దర్శకనిర్మాతలు హీరోయిన్స్ సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డే , శ్రీలిల నటిస్తున్నారు. అయితే మహేష్ బాబు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే ప్రతి సినిమాని కూడా సమ్మర్లో విడుదల చేసేవారు కానీ ఈసారి మాత్రం సమ్మర్ కి తన సినిమాని విడుదల చేయలేకపోతున్నారు.

ఇక 2018లో డైరెక్టర్ కొలటాల శివ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా సమ్మర్ లోనే విడుదలయ్యింది. 2019లో మహేష్ బాబు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాని విడుదల చేయగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 2022లో మహేష్ బాబు డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో వచ్చిన సర్కారు వారి పాట సినిమా కూడా సమ్మర్లోనే విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

అయితే ఎప్పుడు సమ్మర్లో తన హవా కొనసాగించే మహేష్ బాబు ఈసారి మాత్రం ఈ సమ్మర్ ను ఉపయోగించుకోలేకపోయారు. ఈసారి కాకుండా వచ్చే ఏడాది సమ్మర్లో కూడ మహేష్ బాబు సినిమాలు విడుదల కాలేదన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. మొదట ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు చిత్ర బృందం. కానీ కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో ఎట్టకేలకు ఈ సినిమా విడుదలపై గడిచిన కొద్ది రోజుల క్రితం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తన తదుపరిచిత్రాన్ని చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: