తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్ఎస్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈయన వరుస సినిమాలకు సంగీతం అందిస్తూ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.ఇక తమన్ గురించి కాపీ వివాదాలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

ఈయన సినిమాలోని ట్యూన్స్ అన్నీ కూడా కాపీ అంటూ వార్తలు వచ్చిన తమన్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. ఇలా తన మ్యూజిక్ తో స్టార్ హీరోలు అందరికీ బ్లాక్ బాస్టర్ హిట్స్ అందిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా తమ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సాధారణంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయన దగ్గర ఒక టీం ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే వీరు సినిమాలకు మాత్రమే కాకుండా బయట ఇతర ప్రోగ్రామ్స్ కి కూడా అటెండ్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తన టీం లో ఒక మ్యూజిషియన్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్నారట.అయితే ఈయనకు కీమో ఇచ్చి శరీరం మొత్తం కాలిపోయిన స్థితికి వచ్చింది. తనని డిశ్చార్జ్ చేద్దామన్న హాస్పిటల్ వారు మొత్తం డబ్బు చెల్లించి డిశ్చార్జ్ చేయమని చెప్పారట. ఇలా తన పరిస్థితి చూసి చలించిపోయిన తమన్ ఏకంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారని తెలుస్తుంది. ఇలా సదరు మ్యూజిషియన్ కి ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడ్డారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా సింగర్ గీతామాధురి ఆహాలో ప్రసారమౌతున్న ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ షోలో వెల్లడించారు. ఇలా గీత మాధురి ఈ విషయం గురించి చెప్పడంతో స్పందించిన తమన్ తాను బయట ప్రోగ్రామ్స్ చేయడంతో వచ్చిన డబ్బుని చారిటీకి అందిస్తున్నాము అయితే తాను కూడా గుంటూరు లో ఒక పెద్ద అనాధాశ్రమం నిర్మిస్తున్నానని త్వరలోనే దానిని ప్రారంభించబోతున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు. దీంతో ఈ విషయం వైరల్ కావడంతో తమన్ మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: