మెగా మేనల్లుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు అని చెప్పాలి. డాన్సుల్లో, యాక్షన్ లో, యాక్టింగ్ లో తనకు తిరుగులేదు అని నిరూపించాడు.. మెగా కాంపౌండ్ నుంచి హీరోగా వచ్చి మెగా అనే పేరును నిలబెట్టాడు అని చెప్పాలి. ఇకపోతే ఈ మెగా హీరో ఇక ఇప్పుడు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. విరూపాక్ష అనే విభిన్నమైన కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు అని చెప్పాలి.



 ఇక ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు సాయి ధరమ్ తేజ్. అయితే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం బారిన పడిన తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. కాగా ఇటీవల  ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత విశ్రాంతి తీసుకోకుండా ఎందుకు సినిమాలు చేస్తున్నారు అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు.


 యాక్సిడెంట్ తర్వాత కొంత కాలం విశ్రాంతి తీసుకోవచ్చుగా అని మీ అమ్మగారు చెప్పలేదా అంటూ ప్రశ్నిస్తే.. సాయి ధరంతేజ్ మాట్లాడుతూ.. అలా చెబితే బాగుండేదని నా ఫీలింగ్.. మా అమ్మ నాకంటే మొండిది. నువ్వు వెళ్లి పని చేసుకో అంటూ నన్ను బయటికి గెంటేసేయండి. ఇంట్లో ఉంటే వంట చేయడానికి ప్రయత్నిస్తావ్.. దాన్ని నేను తినలేను అంటూ మా అమ్మ చెప్పింది అంటూ నవ్వుకున్నాడు సాయిధరమ్ తేజ్. అయితే యాక్సిడెంట్ సమయంలో నన్ను మా అమ్మ చిన్నపిల్లాడిలాగే చూసుకుంది అంటూ తెలిపాడు. ఇక రోడ్డు ప్రమాదం తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించానని.. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: