ఇళయ దళపతి విజయ్ కి కోలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇటీవల విజయ్ హీరోగా నటించిన 'వారిసు' మూవీ తాజాగా బుల్లితెరపై భారీ టిఆర్పిని అందుకుంది. కోలీవుడ్ లోనే ఫస్ట్ టీవీ ప్రీమియర్ రికార్డు టిఆర్పి రేటింగ్ ని దక్కించుకుంది.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తోనే 300 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని విజయ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ మూవీగా నిలిచింది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. అయితే తమిళం తో పాటు తెలుగులో 'వారసుడు' అనే టైటిల్ తో విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని కనబరిచింది.

ఇదిలా ఉంటె ఇటీవల ప్రముఖ తమిళ టెలివిజన్ సన్ టీవీలో వారిసు మూవీ ప్రీమియర్ అయింది. ఇక ఫస్ట్ ప్రీమియర్ కి తమిళ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తమిళంలో వారిసు టీవీ ప్రీమియర్ కి ఏకంగా 19.60 టిఆర్పి రేటింగ్ వచ్చింది. తమిళంలో అత్యధిక టిఆర్పి రేటింగ్ను దక్కించుకున్న సినిమాల్లో వారిసు మూవీ కూడా ఒకటిగా నిలిచింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటించగా.. శరత్ కుమార్, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, సంగీత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ రొటీన్ స్టోరీ తోనె తెరకెక్కిన సినిమాలో విజయ్ క్యారెక్టర్ ను వంశీ పైడిపల్లి ఫాన్స్ కి నచ్చేలా తీర్చిదిద్దడంతో కోలీవుడ్లో ఈ సినిమా భారీ వసూళ్లు అందుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా ఈ సినిమా ఎంతగానో కనెక్ట్ అయింది.

ఇక థియేటర్లోనే కాకుండా ఇప్పుడు టీవీలో కూడా ఈ సినిమాకి అత్యధిక టిఆర్పీ రేటింగ్స్ రావడం విశేషం. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇక ప్రస్తుతం విజయ్ లోకేష్ దర్శకత్వంలో 'లియో' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లోనే ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేసి సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశారు. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్,ఎస్ లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: