పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆది పురుష్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి. 500 కోట్ల భారీ బడ్జెట్ తో టి సిరీస్ భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఇక రామాయణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తూ ఉండగా.. సీత పాత్రలో కృతి కనిపించబోతుంది.



 లంకాధిపతి రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు అని చెప్పాలి. ఇక త్రీడీలో ఈ సినిమా ఉండబోతుంది. అయితే గతంలో ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పై విమర్శలు రాగా.. మళ్ళీ వెనక్కి తగ్గిన చిత్ర బృందం ఇక విజువల్ ఎఫెక్ట్స్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ప్రస్తుతం విజువల్  ఎఫెక్ట్స్ అభిమానులు అందరిని కూడా ఆకర్షిస్తూ ఉన్నాయ్. ఇక ఈ మూవీ ని ఎలా అయినా గ్రాండ్ గా మార్కెట్ లోకి తీసుకువెళ్లాలని దర్శకుడు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.



 గతంలో ఈ మూవీపై వచ్చిన నెగిటివ్ వైబ్ ను పూర్తిగా దూరం చేసి.. పాజిటివ్ బజ్ పెంచే దిశగా ఇక పక్క ప్లాన్ చేస్తూ ఉన్నాడు డైరెక్టర్ ఓం రౌత్. ఇకపోతే ఇటీవల ఆది పురుష్ అప్డేటెడ్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ఇకపోతే ట్రైలర్ ఎప్పుడొస్తుందా అని అటు అభిమానులు కూడా ఎదురు చూడటం మొదలుపెట్టారు. అయితే వచ్చే నెలలో ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మే మూడు లేదా 17 తేదీలలో ఏదో ఒక రోజు ట్రైలర్ రిలీజ్ ఉంటుందని సమాచారం. ఇక ఈ ట్రైలర్ నడివి 3:22 నిమిషాలు ఉంటుందని టాక్ వినిపిస్తుంది. విషయం తెలిసి ట్రైలర్ కోసం మరింత ఆత్రుతగా ఎదురు చూడటం మొదలుపెట్టారు అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి: