టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇతర డైరెక్టర్స్ తో పోల్చుకుంటే ఈయన రైటింగ్ స్కిల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. దానికి తోడు తన క్రియేటివ్ థాట్స్ తో సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆ సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తో 'పుష్ప' సినిమాని తెరకెక్కించి పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప ది రైజ్ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 

సినిమా ఏకంగా 360 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని సెన్సేషనల్ హిట్టుగా నిలిచింది. ఇక ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు సుకుమార్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే సుకుమార్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో తెగ చెక్కర్లు కొడుతోంది. నిజానికి పుష్ప ది రూల్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో సుకుమార్ సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఎందుకనో ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు ఊసే లేదు. అయితే విజయ్ దేవరకొండ కాకుండా సుకుమార్ ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడని అంటున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సుకుమార్ సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిన ప్రభాస్.. ఆయా సినిమా షూటింగ్స్ తో తెగ బిజీగా ఉన్నాడు. అయితే ఈ వీటితో పాటే సుకుమార్ తో కూడా సినిమా చేయబోతున్నాడట డార్లింగ్. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్లో తెగ వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఒకవేళ ఈ న్యూస్ కనుక నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతానికి సుకుమార్ బన్నీతో తెరకెక్కిస్తున్న పుష్ప2 షూటింగ్ ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి సినిమాని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: