రూపాక్ష సినిమాతో సాయి ధరమ్ తేజ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి చేరింది. ఈ సినిమా అరుదైన రికార్డులను సొంతం చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అవుతోంది.

ఓవర్సీస్ లో ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య పెరుగుతుండటం విశేషం.తాజాగా ఓవర్సీస్ లో ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లో కూడా చేరింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే సేఫ్ కాగా లాంగ్ రన్ లో ఈ సినిమా మంచి లాభాలు అందించే ఛాన్స్ కూడా ఉంది.

కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. అయితే సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయిన సమయంలో అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి సాయం చేశారు. సరైన సమయానికి అబ్దుల్ స్పందించడం వల్లే తేజ్ ప్రాణాలకు ఎలాంటి అపాయం  అయితే కలగలేదు. అయితే తాజాగా అబ్దుల్ సాయితేజ్ కామెంట్ల గురించి స్పందిస్తూ తనకెవరూ సహాయం చేయలేదంటూ సంచలన ఆరోపణలను చేశారు.

ఇందుకు సంబంధించిన కథనాలు సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అవుతున్నాయి. ఈ కథనాలు తన దృష్టికి రావడంతో సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. నాపై, నా టీమ్ పై దుష్ప్రచారం జరుగుతోందని కూడా ఆయన అన్నారు. అబ్దుల్ కు ఎలాంటి రివార్డ్ ను ఇవ్వలేదని ఎంతో కొంత ఇచ్చి సరిపెట్టుకోవాలని అనుకోలేదని సాయిధరమ్ తేజ్ కామెంట్లు కూడా చేశారు. అబ్దుల్ చేసిన సాయానికి నేను, నా ఫ్యామిలీ రుణపడి ఉంటామని సాయిధరమ్ తేజ్ కూడా చెప్పుకొచ్చారు. అబ్దుల్ కు ఏ సహాయం కావాలన్నా కోరాలని నా నంబర్ తో పాటు మేనేజర్ నంబర్ కూడా ఇచ్చానని అబ్దుల్ ఎప్పుడు ఏం కోరినా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని సాయిధరమ్ తేజ్ అన్నారు. ఈ విషయంపై ఇకపై మాట్లాడాలని అనుకోవడం లేదని ఆయన కామెంట్లు కూడా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: