కన్నడ ఇండస్ట్రీలో హీరో రిషబ్ శెట్టి ఒకవైపు దర్శకుడుగా హీరోగా నటించిన చిత్రం కాంతార. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లేవల్ల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచి కలెక్షన్ల పరంగా భారీగానే రాబట్టింది. రూ.16 రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపుగా రూ .400 కోట్ల రూపాయల కలెక్షన్లతో మంచి విజయాన్ని అందుకుంది.

దీంతో ప్రేక్షకులు అంతా కూడా కాంతార-2 చిత్రం కోసం చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ కూడా తెరకెక్కించబోతున్నట్లు శాండిల్ వుడ్ల పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ హీరో రిషబ్ శెట్టి.. ఈ సినిమా కథ సీక్వెల్ కోసం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇవ్వడం జరిగింది రిశబ్ శెట్టి. ఈ సినిమా పనులు ఫుల్ సింగ్ లో జరుగుతున్నాయి కాంతార సినిమా ముందుగా కన్నడ లో విడుదలై ఆ తర్వాత తెలుగులోపాటు పలు భాషలలో విడుదల చేశారు.


అన్ని భాషలలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ఏకంగా పాణిధ్య స్టార్ హీరోగా పేరుపొందారు. ఇప్పటికే ఫ్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. రీసెంట్గా భూతకొలను వేడుకలలో కూడా రిషబ్ శెట్టి వైభవంగా పాల్గొన్నట్లు తెలుస్తోంది తన కుటుంబంతో కలిసి పాల్గొన్నట్లుగా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ గా మారుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సైతం ఈ సినిమా సీక్వెల్ మరింత పగడ్బందీగా తెరకెక్కిస్తున్నారని కాంతార మొదటి భాగాన్ని మించి ఈ సినిమా సీక్వెల్ ఉండబోతోంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: