టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత పుట్టినరోజు సందర్భంగా ఒక అభిమాని గుడి కట్టిన సంగతి తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందిన సందీప్ సమంత విగ్రహాన్ని తయారు చేయించి తన ఇంట్లో ప్రతిష్టించుకున్నాడు. అయితే ఈ సందర్భంగా ఊర్లో ఉన్న వారందరికీ భోజనాలు కూడా పెట్టించినట్లు సమాచారం. గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం సమంతా గుడి ని కట్టడానికి సుమారుగా రూ 6 లక్షల రూపాయల వరకు ఖర్చయినట్లుగా తెలియజేశారు.


సమంత తో పాటు ప్రత్యూష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమె చేసి సేవా కార్యక్రమాలకు కూడా ఫిదా అయి గుడి కట్టారని తెలియజేస్తున్నారు సందీప్. తాజాగా సమంత గుడి కట్టడంపై సందీప్ భార్య స్పందించడం జరిగింది.. తాను ఎంతగానో ఆరాధించే.. ఇష్టపడే హీరోయిన్ కు సందీప్ ఆలయం కట్టడంపై ఆమె చాలా ఆనందాన్ని తెలియజేస్తోంది.. మా ఆయన లాగే నాకు కూడా సమంత అంటే చాలా ఇష్టం రోజు ఒక్కసారైనా సమంత టాపిక్ మా ఇంట్లో వస్తూ ఉంటుందని ఇక పెళ్లయిన కొత్తలో సమంత అభిమానిని మా ఆయన చెప్పారు ఆమెకు చాన్నాళ్లుగా గుడి కట్టాలనుకుంటున్న ఇప్పటికీ కుదిరిందని సందీప్ భార్య తెలియజేయడం జరిగింది.


సమంత ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈమె నటించినా శాకుంతలం సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.. డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హిందీలో సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ని రాజు అండ్ డీకే నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తూ ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ ని రాజు అండ్ డీకే నిర్మిస్తూ ఉన్నారు ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తూ ఉన్నారు. విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్మిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: