

ఇళయరాజా సోదరుడు వరదరాజన్ 1973 లో మరణించినట్లు తెలుస్తోంది.ఆయనకు ఇద్దరు కుమారులు ఒకరు 2020 లో కిడ్నీ సమస్యలతో మరణించాగ ..ఇప్పుడు మరొక కుమారుడు పావలార్ శివన్ మే రెండవ తేదీన అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. పావలార్ శివన్ రెండు మూడు చిత్రాలకు సంగీత దర్శకుడుగా కూడా పనిచేశారు.పావలార్ శివన్ అంత్యక్రియలు కూడా ఈరోజే నిర్వహించబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఇళయరాజా, యువ శంకర్రాజ, కార్తీక రాజ తదితరులు పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇళయరాజా ఇప్పటికీ పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తూనే ఉన్నారు. ఇళయరాజా అన్న కొడుకు మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.