టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సినిమాకి మధ్య గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తెగ చేస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ నుంచి ఇంకో సినిమా సెట్స్ లోకి వెళ్ళిపోతున్న పవన్ కళ్యాణ్, లేటెస్ట్ గా OG ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశాడు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా 'OG'. ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా 'పవన్ కళ్యాణ్'ని చూపిస్తూ ముంబై బ్యాక్ డ్రాప్ లో జరిగే మాఫియా కథతో OG సినిమా తెరకెక్కుతుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటివలే చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ముంబైలో జరిగిన ఈ షెడ్యూల్ కంప్లీట్ కావడంతో మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేజ్ ని తెరపై చూస్తారు అంటూ డీవీవీ ఎంటర్టైన్మెంట్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ వచ్చింది. సెప్టెంబర్ 2 వ తేదీన OG నుంచి అదిరిపోయే అప్డేట్ బయటకి వచ్చే ఛాన్స్ ఉంది.


ఇక OG సినిమా ముంబై షెడ్యూల్ అయిపోవడంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు పీరియాడిక్ హీరోగా మారిపోవడానికి రెడీ అయ్యాడు.టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఎపిక్ వార్ డ్రామా 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాయిన్ అవ్వనున్నాడు. ఎప్పటి నుంచో సెట్స్ పైకి ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఎప్పుడో కంప్లీట్ అవ్వల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వలన డిలే అవుతూ వచ్చింది. అయితే అసలు ఈ సినిమా ఎంతవరకు షూట్ చేశారు? ఇంకా ఎంత బాలన్స్ ఉంది? ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఇలాంటి ఏ విషయంపైనా కూడా ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో పూర్తిగా లోఫేజ్ లో ఉన్న సినిమా హరిహర వీరమల్లు మాత్రమే.మరి ఈ ప్రాజెక్ట్ పై ఉన్న  అనుమానాలని క్రిష్ ఎలా క్లియర్ చేస్తాడో చూడాలి.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కడంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. మరి చూడాలి ఈ సినిమా ఇంకెన్ని పాన్ ఇండియా రికార్డులు నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: