టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత నాగచైతన్య విడిపోయి దాదాపు రెండేళ్లు కావస్తోంది. వీరు విడిపోయి ఇంతకాలం గడుస్తున్నా ఎప్పటి వరకు తమ విడాకులపై ఎప్పుడూ కూడా వీరిద్దరూ నోరు విప్పలేదు. అయితే తాజాగా నాగచైతన్య తొలిసారిగా తాము విడాకులు తీసుకోవడానికి వెనకున్న కొన్ని కారణాలను ఇటీవల బయట పెట్టడం జరిగింది .అప్పుడు నాగచైతన్య మాట్లాడుతూ సమంతతో నేను గడిపిన ప్రతి ఒక్క క్షణాన్ని చాలా గౌరవిస్తానని.. ఆమె చాలా లవ్లీ పర్సన్ అంటూ తన మాజీ భార్యపై ప్రశంసలు కురిపించారు నాగచైతన్య.

 దాంతోపాటు సమంతా ఎప్పటికీ ఇలానే సంతోషంగా ఉండాలని సమంత కచ్చితంగా అన్ని ఆనందాలకు అర్హురాలు అంటూ సమంతపై కొన్ని వ్యాఖ్యలను చేశాడు నాగచైతన్య. మొదటిసారిగా నాగచైతన్య తమ విడాకులపై స్పందించడంతో నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక నాగచైతన్య వ్యాఖ్యలు విన్న చాలామంది నెటిజన్స్ విడిపోయిన కూడా వీరిద్దరికీ ఒకరుంటే ఎంతో గౌరవం ఉందని చైతన్య సమంత మళ్ళి కలిసిపోతే చూడాలని ఉందంటూ తమ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

 ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు సమంతా తని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది.మనమంతా ఒకటే.. కేవలం అహంకారం భయాలు మనల్ని దూరం చేస్తాయి.. అంటూ ఒక కొటేషన్ ని సమంత అతను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. అయితే నాగచైతన్య కామెంట్స్ చేసిన తర్వాత సమంత ఈ పోస్ట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. దీంతో సమంత పోస్టు చూసిన చాలామంది వీరు ఈగోలకు పోయి విడిపోయినట్లుగా ఉంది అంటూ మా అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే చైతన్య కూడా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు పుకార్ల వల్ల దూరం పెరిగింది అని స్వయంగా చెప్పాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: