మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం వాల్టేర్ వీరయ్య మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో చిరంజీవి హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ ఆధారంగా రూపొందుతుంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , కీర్తి సురేష్ , సుశాంత్మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

మహతి స్వర సాగర సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు . ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి వేదాళం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతోంది . ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల కాక ముందే చిరంజీవి తన నెక్స్ట్ రెండు మూవీ లను ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి "భోళా శంకర్" మూవీ తర్వాత సోగ్గాడే చిన్నినాయన మూవీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ తర్వాత బింబిసారా మూవీ దర్శకుడు మల్లాడి వశిష్ట దర్శకత్వంలో మరో మూవీ లో చిరంజీవి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా చిరంజీవి నెక్స్ట్ రెండు మూవీ లకు ఇప్పటికే డైరెక్టర్ లను ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: