టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్న వారిలో పంజా వైష్ణవ్ తేజ్ ఒకరు. ఈ నటుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందినటు వంటి ఉప్పెన మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మూవీ కి సంగీతం అందించాడు. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయం సాధించడంతో వైష్ణవ్ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది.

అలా ఉప్పెన మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వైష్ణవ్ ఆ తర్వాత కొండపొలం ,  రంగ రంగ వైభవంగా అనే సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను సాధించాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో "ఆది కేశవ" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కి జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

మూవీ ని ఈ సంవత్సరం జూలై నెలలో విడుదల చేయనునట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ వీడియోకు విడుదల 24 గంటల్లో 4.50 మిలియన్ వ్యూస్ ,  70 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ లోని ఫస్ట్ గ్లిమ్స్ వీడియో కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: