న్యాచురల్ స్టార్ నాని దసరా హిట్ తో తన కాన్ ఫిడెన్స్ రెండింతలు పెంచుకున్నాడు. సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మీద నాని పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అంతేకాదు నిర్మాతగా సుధాకర్ చెరుకూరికి మొదటి కమర్షియల్ హిట్ దక్కింది. ఈ హిట్ తో ఆయన నాగ శౌర్యతో చేస్తున్న రంగబలి మీద భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమాను కూడా డిబనెంట్ పవన్ డైరెక్ట్ చేస్తున్నాడు. దసరా తర్వాత నాని మరోసారి నూతన దర్శకుడు శౌర్యువ్ తో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో కూడా నాని చాలా నమ్మకంగా ఉన్నాడట.

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నాని, మృణాల్ జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమాను అసలైతే డిసెంబర్ 23న రిలీజ్ ప్లాన్ చేశారు. వెంకటేష్ సైంధవ్ సినిమాను కూడా ఆ రోజున రిలీజ్ అనుకున్నారు. నాని వర్సెస్ వెంకటేష్ ఫైట్ తప్పదని అనుకున్నారు. కానీ లేటెస్ట్ టాక్ ఏంటంటే నాని క్రిస్ మస్ రేసు నుంచి సంక్రాంతికి రిలీజ్ షెడ్యూల్ మార్చాడట. ఏంటి నాని పొంగల్ రేసులోనా అని డౌట్ పడొచ్చు.

ఆల్రెడీ ఈసారి సంక్రాంతికి మహేష్ 28వ సినిమాతో పాటుగా ప్రభాస్ ప్రాజెక్ట్ కె కూడా వస్తుంది. బాలకృష్ణ అనీల్ రావిపుడి సినిమా దసరాకి రిలీజ్ కుదరకపోతే సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. సో ఈ సినిమాల మధ్య నాని సినిమా వస్తుందా అంటే.. నానికి కూడా ఒక సర్టైన్ ఫ్యాన్ బేస్ ఉంది. అతని సినిమాకు ఓపెనింగ్స్ వస్తాయి. దసరా హిట్ జోష్ లో ఉన్నాడు కాబట్టి నాని కూడా సంక్రాంతికి వచ్చి హిట్ కొడదామని చూస్తున్నాడు. అయితే నాని సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్ గా వస్తుంది. సంక్రాంతికి ఫ్యామిలీ అంతా చూసే సినిమా అవుతుందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: