మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''టైగర్ నాగేశ్వరరావు''. ఈ సినిమాతో రవితేజ మొదటిసారి పాన్ ఇండియా వైడ్ పాపులర్ కాబోతున్నాడు.

ప్రస్తుతం రవితేజ లైనప్ లో ఉన్న ఒకే ఒక్క సినిమా ఇదే కావడంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ సినిమాలను స్టార్ట్ చేయాలని రవితేజ ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది.

టైగర్ నాగేశ్వరరావు సినిమాను డైరెక్టర్ వంశీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడట.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా బడ్జెట్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను నిర్మాతలు నిర్మిస్తున్నారని తెలుస్తుంది.. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఇప్పుడు నిర్మాతలు ప్లానింగ్ చేస్తున్నారట..

ఈ ఫస్ట్ లుక్ ను ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో స్టార్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.దీని వల్ల ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంటుంది అని ఇలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.. ఇక నిన్ననే ఈ సినిమా కన్నడ ఫస్ట్ లుక్ ను స్టార్ హీరో శివ రాజ్ కుమార్ లాంచ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారట... ఇక ఇప్పుడు మరో అప్డేట్ కూడా ఇచ్చారు.

సినిమా మలయాళంకు సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు.. అక్కడి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ తో వాయిస్ ఓవర్ తో పరిచయం చేస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేసారట . సీతారామం సినిమాలో రామ్ గా వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ యంగ్ హీరో టైగర్ కు తన వంతు ప్రమోషన్స్ చేస్తున్నాడని తెలుస్తుంది.. ఇలా ఒక్కో భాషలో ఒక్కో స్టార్ తో సాలిడ్ ప్లానింగ్స్ చేస్తున్నారని సమాచారం.ఈ సినిమా ఫస్ట్ లుక్ మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్ అంతా గర్వంగా చెప్పుకునే లెవల్లో ఈ అప్డేట్ ఉంటుందని.. ఫస్ట్ లుక్ తోనే మాస్ మహారాజ మాస్ సంభవం గ్యారెంటీ అంటూ అతి త్వరలోనే ఈ లుక్ ను విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ మాట ఇచ్చారట . దీంతో ఫ్యాన్స్ ఈ అప్డేట్ కోసం బాగా ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: