ది  కేరళ స్టోరీ.. ఈ సినిమా విడుదల అయినప్పుడు నుంచి ఈ సినిమాను వరుసగా కాంట్రవర్సీలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి.

విడుదలైన మొదటి ఒకటి రెండు రోజుల్లోనే చాలా ప్రదేశాలలో ఈ సినిమాను థియేటర్ నుంచి తొలగించేశారని తెలుస్తుంది.. అంతేకాకుండా ఈ సినిమాను వెంటనే ఆపేయాలి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు నిరసనలు కూడా చేశారు. తమిళనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏకంగా నిషేదించారు.ఈ సినిమాకు వివాదాలే బాగా కలిసి వచ్చాయని అయితే చెప్పవచ్చు. కొంతమంది ఈ సినిమాకు మద్దతుగా నిలుస్తుంటే మరి కొంతమంది మాత్రం ఈ సినిమాకు వ్యతిరేకంగా అయితే మాట్లాడుతున్నారు.

దీంతో కాంట్రవర్సీలే ఈ సినిమాకు బోలెడంత పాపులారీటిని అయితే తెచ్చి పెట్టాయి. కాగా ఈ సినిమా కొన్ని రాష్ట్రాలలో భారీగా కలెక్షన్స్ ను రాబడుతూ బాగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 100 కోట్లకు పైగా వసూళ్లను అయితే రాబట్టింది. రోజు రోజుకూ ఈ సినిమాకు ప్రేక్షకాదరణ కూడా పెరుగుతుండడంతో చిత్ర యూనిట్ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తుంది. లవ్ జిహాద్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‏ను బాగా ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఒక్క సినిమాతో హీరోయిన్ అదా శర్మ క్రేజ్ కూడా ఒక్కసారిగా మారిపోయింది.

దేశవ్యాప్తంగా ఈమెకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. కాగా ది కేరళ స్టోరీ చిత్రంలో అదా శర్మ నటనకు భారీగా ప్రశంసలు అందుకుంటుంది. అంతేకాకుండా ఈ బ్యూటీకి ఇప్పుడు వరుసగా అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయట.. అయితే సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ది కేరళ స్టోరీ సినిమాకు అదా శర్మ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు కూడా బాగా నడుస్తున్నాయి. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‏తో ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రం కోసం అదా శర్మ ఏకంగా రూ. 1 కోటి పారితోషికం తీసుకుందని అయితే తెలుస్తోంది. కాగా ఇందులో యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ, అదా శర్మ ప్రధాన పాత్రలలో నటించగా వీరిలో అత్యధిక రెమ్యూనరేషన్ ను హీరోయిన్ అదా శర్మ అందుకుందని తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: