మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష.. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఈ చిత్రాన్ని తెరకెక్కించి విడుదల చేయడం జరిగింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమా మొత్తం హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగరంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఇటీవలే ఈ సినిమా రూ.100 కోట్లా క్లబ్ లో చేరినట్లు చిత్ర బృందం ప్రకటించింది.


ఇప్పుడు తాజగా ఈ సినిమా కోసం ఓటిటి అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్టుగానే ఈరోజు స్ట్రిమింగ్ కావడం జరిగింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ విరూపాక్ష చిత్రాన్ని అధిక ధరకు కొనుగోలు చేసింది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మే 20వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రిమింగ్ మొదలయ్యింది. దీంతో చాలా మంది ఫాన్స్ ఈ సినిమా చూస్తూ తమ అభిప్రాయాలను కూడా సోషల్ మీడియాలో తెలియజేయడం జరుగుతోంది.


విరూపాక్ష చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్ బ్యానర్ పైన నిర్మించారు. విరుపాక్ష చిత్రాన్ని ఇతర భాషలలో విడుదల చేయగ పరవాలేదు అనిపించుకుంది. ఈ చిత్రంలో సునీల్ ,రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సోనియా, యాంకర్ శ్యామల తదితరులు ప్రధానోపాత్రలు నటించినట్లు తెలుస్తోంది. థియేటర్ల విరూపాక్ష చిత్రాన్ని మిస్సయిన వారు ఓటీటి లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. అందుకు సంబంధించి ట్వీట్ కూడా వైరల్ గా మారుతోంది. మరి ఈ సినిమా తర్వాత సాయి ధరంతేజ్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: