తెలుగులో సెన్సేష నల్ హిట్ నీ అందుకున్న రొమాంటిక్ సినిమా అర్జున్ రెడ్డి.. నటుడు విజయ్ దేవరకొండ, శాలిని పాండే నటించిన ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టెనర్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం అన్ని ఇండస్ట్రీలో తెరకెక్కింది.. ఈ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలే.. అదే జోష్ మించిన రొమాన్స్ తో హిందీలో కూడా తెరకెక్కింది..


అర్జున్ రెడ్డి రీమేక్ గా హిందీలో తెరకెక్కిన చిత్రం కబీర్ సింగ్ సినిమా ప్రేక్షాదరణ పొందింది.. విడుదల అయిన మొదటి రోజునే సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. 256 కోట్లకు పై మాటగా సినిమా విడుదల అయిన ఈ సినిమా  కలెక్షన్స్ రాబట్టింది..సినిమా ఎంత హిట్ అయిందో అంతకు మించిన విమర్శలు కూడా అందుకుంది.


ఇకపోతే ఈ సినిమాలో నటించిన కియారాసినిమా లో చాలా సన్నివేశాలు ఆమెను ఇబ్బందికి గురిచేశారు వెల్లడించింది.షాహిద్‌ కపూర్‌ కథానాయకుడు. సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడు. ఇందులో ప్రీతీ పాత్రను కియారా పోషించారు. హిందీలోనూ ఈ సినిమా విజయం అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.276 కోట్లు వసూలు చేసింది. అయితే ఇందులో హీరో మహిళల పట్ల ప్రవర్తించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం గురించి కియారా తాజాగా మాట్లాడారు. 

 

సినిమాలు వేరు, నిజ జీవితం వేరని, వీటిని ముడిపెట్టి చూడడం సరైంది కాదని పేర్కొన్నారు.కొన్ని సన్నివేశాలు కొందర్ని బాగా ఇబ్బంది పెట్టాయని నాకు తెలుసు. ఇందులో నేను ఓ నటిని మాత్రమే. ఆ పాత్రను నమ్మి, న్యాయం చేయడం నా బాధ్యత. వ్యక్తిగతంగా ఇలాంటి సన్నివేశాలు నాకూ నచ్చకపోవచ్చు, అసౌకర్యంగా అనిపించొచ్చు. చెడు లక్షణాలున్న వ్యక్తి (కబీర్‌ సింగ్‌) జీవితం ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. అందుకే సినిమాని సినిమా లాగా చూడాలి అంటూ ఆమె హితవు పలికింది.. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలలో నటిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: