తమిళ స్టార్ కార్తీ వరుస విజయాలతో జోరు మీదున్నాడు. మొన్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన "ఖైదీ" సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హిరోయిన్ లేకుండా వచ్చిన ఈ చిత్రం దీపావళి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షమ్ కురిపించింది. అంతకుముందు తెలుగులో పడిపోయిన తన మార్కెట్ ని ఒక్కసారిగా పెంచిన చిత్రమిది.

 

 

సినిమా తర్వాత రెండు నెలల్లోనే వచ్చిన చిత్రం "దొంగ". ఈ సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ మంచి వసూళ్ళు వస్తున్నాయి. అయితే ఇదిలా ఉంటే కార్తీ ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్`లో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీకి మంచి పాత్రే ఉందట.

 

 

అయితే ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే కార్తీ మరొ సినిమని లైన్లో పెట్టాడు. విశాల్ నటించిన  అభిమన్యుడు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు మిత్రన్ దర్శకత్వంలో కార్తీ సినిమా చేస్తున్నాడట. అభిమన్యుడు తర్వాత మిత్రన్ శివ కార్తికేయతో "హీరో" అనే సినిమా చేసిన్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం విశాల్ హీరోగా `అభిమన్యుడు` సీక్వెల్ పై వర్క్ చేస్తున్నారు.

 

 

 

సినిమా అనంతరం కార్తీతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. కార్తీ మణిరత్నం సినిమా సెట్ లో ఉండగానే కార్తీ ఈ సినిమాకి కమిట్ అయ్యాడట. మణిరత్నం సినిమా షూటింగ్ పూర్తయ్యాక మిత్ర సినిమా షూటింగ్ లో జాయినవుతాడట. మరి ఇద్దరు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన వారు తీసిన సినిమా మరో బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: