లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తాజాగా "ఇండియన్ 2" అనే మూవీ చిత్రీకరణ పూర్తి అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా ఈ మూవీ మేకర్స్ ప్రకటించలేదు. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఆలోచనలను చేస్తున్నట్లు సమాచారం.

మూవీ బృందం ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యంత గ్రాండ్ గా నిర్వహించేందుకు , అలాగే ఆ ఈవెంట్ కు అద్భుతమైన క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలను ముఖ్య అతిథులుగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చెన్నై లో అత్యంత గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్స్ చేస్తున్నట్లు , అలాగే దానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను ముఖ్య అతిథులుగా తీసుకు వచ్చే ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు  అన్నీ కుదిరితే చెన్నై లో రజనీకాంత్ , రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: