హీరో రాజశేఖర్... ఒకప్పుడు స్టార్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి... తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాలతో టాలీవుడ్ ని షేక్  చేశారు రాజశేఖర్. ఇక ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల  గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు ఎన్నో ఏళ్ల తరువాత మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి... తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంది యువ హీరోలు తమ సినిమాలతో దూసుకుపోతున్న తరుణంలో కూడా రాజశేఖర్ తన సినిమాలతో సత్తా చాటుతూ మంచి విజయాలను అందుకున్నారు. విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ... మంచి సినిమాలు చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు  హీరో  రాజశేఖర్. 

 

 

 ఇప్పటికే రాజశేఖర్ హీరోగా నటించిన గరుడవేగ మంచి విజయాన్ని సాధించింది... ఇక మొన్నటికి మొన్న కల్కి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన కల్కి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు హీరో రాజశేఖర్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అహనా పెళ్లంట పూలరంగడు సినిమాలకు దర్శకత్వం వహించిన వీరభద్రం చౌదరి కి తన తదుపరి సినిమా అప్పగించారు హీరో రాజశేఖర్. వాస్తవానికి ఓ కన్నడ రీమేక్లో నటించాలని దానికి సత్య బేతాళుడు సినిమాల దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తిని తీసుకోవాలని ముందుగా రాజశేఖర్ అనుకున్నారట. 

 

 

 కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కాస్త పట్టాలేకపోవడంతో వీరభద్రం చౌదరి కి లైన్ క్లియర్ అయిపోయింది. ప్రస్తుతం సీనియర్ హీరో లకు ఒక సమస్య హీరోయిన్లను వెతకడం. జూనియర్ హీరోలకు అయితే చాలా మంది హీరోయిన్లు ఉన్నారు కానీ సీనియర్ హీరోలకు మాత్రం హీరోయిన్లు చాలా తక్కువ. ఈ క్రమంలోనే రాజశేఖర్ వయసుకు తగ్గ గ్లామర్ హీరోయిన్ కావాలని భావించిన దర్శకుడు.. గ్లామర్ బ్యూటీ శ్రియను  సెలెక్ట్ చేసారట. ఓవైపు హుందాగా కనిపిస్తూనే మరోవైపు గ్లామర్ ను తొలగించే పాత్ర కాబట్టి... ఈ పాత్రకు శ్రీయ అయితేనే అసలైన అన్యాయం చేస్తోంది అని దర్శకుడు భావిస్తున్నాడట. ఈ సినిమాలో నటించేందుకు శ్రియ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. కాగా ఈ వెటరన్  బ్యూటీ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా చాన్స్ కొట్టేసింది అన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: