టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్దిరోజుల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన సరిలేరు నీకేవ్వరు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆ సినిమా మొత్తానికి హిట్ కొట్టి, వరుసగా మహేష్ కు మూడవ విజయాన్ని అందించి హ్యాట్రిక్ దక్కేలా చేసింది. ఇక ఆ సినిమా విజయానందంలో ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లి వచ్చిన సూపర్ స్టార్, ప్రస్తుతం తన తదుపరి సినిమా విషయమై గట్టిగా కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూపర్ స్టార్, ప్రస్తుతం ఆ కథలో లోటుపాట్లను వెతికి వాటిని సరిచేయమని దర్శకుడికి చెప్పారట. 

 

వాస్తవానికి ఆ సినిమా ఈపాటికి ముహూర్తం జరుపుకోవలసి ఉందని, అయితే సడన్ గా ఈ కరోనా మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా షూటింగ్స్ అన్ని కూడా నిలిపివేయబడడంతో సినిమాని తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న ప్రారంభించాలని మహేష్ భావిస్తున్నారట. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారట. ఇక ఈ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారని లేటెస్ట్ గా టాలీవుడ్ వర్గాల టాక్. 

 

నిజానికి రెండేళ్ల క్రితమే మహేష్ తో త్రివిక్రమ్ పనిచేయాల్సి ఉందని, అయితే కొన్ని అనివార్య కారణాల వలన అది వర్కౌట్ కాలేదని సమాచారం .ఇక ఇటీవల రెండు రోజుల క్రితం మహేష్ కు ఫోన్ ద్వారా ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ని వినిపించారట త్రివిక్రమ్. అయితే విన్న వెంటనే అది ఎంతో నచ్చిన మహేష్, దానిని పూర్తి స్క్రిప్ట్ గా సిద్ధం చేయమని, పరశురామ్ సినిమా అనంతరం దానిని మొదలెడదాం అని చెప్పినట్లు టాక్. మరి ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మహేష్, త్రివిక్రమ్ ల కాంబో సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఇది మంచి పండుగ వార్తే అని చెప్పవచ్చు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: