ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో దేశం మొత్తం లాకౌట్ ప్రకటిచడంతో సినిమా షూటింగ్స్ కూడా రద్దు అయ్యాయి. దానితో పలువురు స్టార్స్ తమ ఇళ్లలోనే ఉండిపోయి ఫ్యామిలీ లతో ఎంజాయ్ చేస్తున్నారు. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఎంతో సరదాగా గడుపుతున్నారు. ఇక ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ తో వరుసగా మూడు విజయాలు అందుకున్న సూపర్ స్టార్, దాని తరువాత పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. వాస్తవానికి తన తదుపరి సినిమాని వంశీ పైడిపల్లితో చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ సినిమా కథ పూర్తిగా సిద్ధం కాకపోవడంతో మహేష్ పరశురామ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

 

ఒక మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ క్యారెక్టర్ అదిరిపోనుందని, అలానే మహేష్ కూడా అప్పుడే ఆ పాత్ర కోసం అన్ని విధాలా సిద్ధం అవుతున్నట్లు చెప్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మహేష్ సొంత నిర్మాణ సంస్థైన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించనున్నట్లు టాక్. మహేష్ సరసన ఒక స్టార్ హీరోయిన్ నటించనున్న ఈ సినిమాకు సంగీతం అందించేందుకు యువ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. 

 

వాస్తవానికి ముందుగా ఈ సినిమాలు దేవిశ్రీ లేదా థమన్ సంగీతం అందిస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఇటీవల పరశురామ్ తీసిన గీత గోవిందంకు అదరగొట్టే సాంగ్స్ అందించిన గోపి సుందర్ అయితేనే ఈ సినిమాకు న్యాయం చేయగలడని భావించి మహేష్ అతన్ని తీసుకుందాం అని సూచించినట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ నిజం అయితే మాత్రం గోపి సుందర్ కు ఇది చాలా పెద్ద అవకాశం అనే చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: