డార్లింగ్ ప్రభాస్ కు బాయ్స్ ఫాలోయింగ్ ఎంత ఉందో.. గాళ్స్ ఫాలోయింగ్ అంతకు మించి రేంజ్ లో ఉందని చెప్పాలి. గాళ్స్ ఫ్యాన్స్ ప్రభాస్ రొమాంటిక్ క్యారెక్టర్ లో చూడాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. ఇన్నాళ్లకు డార్లింగ్ లేడీ ఫ్యాన్స్ కోరిక తీర్చబోతున్నట్టు వినిపిస్తోంది. న్యూ మూవీలో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య సెన్సిబుల్ లవ్ ట్రాక్ ఓ రేంజ్ లో ఉందని వినికిడి. 

 

ప్రభాస్ కెరీర్ స్టార్టింగ్ లోనే మాస్ క్యారెక్టర్స్ తో మాస్ లోకి దూసుకుపోయాడు. అయితే వర్షం సినిమాలో ప్రభాస్ లవర్ బాయ్ గా కనిపించి ఇటు మాస్ తో పాటు క్లాస్ ని అట్రాక్ట్ చేశాడు. ఆ తర్వాత డార్లింగ్ సినిమాతో గాళ్స్ కు డార్లింగ్ అయిపోయాడు. ఆ వెంటనే వచ్చిన మిస్టర్ పర్ ఫెక్ట్ లో మరోసారి క్లాస్ క్యారెక్టర్ లో కనిపించి లేడీస్ కు మరింత దగ్గర్యయాడు. ఇక మిర్చి సినిమాలో మనోడి లుక్స్ కు గాళ్స్ హార్ట్ బీట్ పెరిగిపోయిందనే చెప్పాలి. 

 

బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ఆ తర్వాత సాహోతో క్రేజ్ కంటిన్యూ చేశాడు. ఇలాంటి టైమ్ లో లేడీ ఫ్యాన్స్ ప్రభాస్ ఎప్పుడెప్పుడు ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో కనిపిస్తాడా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ కొత్త సినిమాపై ఓ ఆసక్తికర విషయం కనిపిస్తోంది. రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమాలో లవ్ ట్రాక్ అద్భుతంగా ఉంటుందని వినికిడి. 

 

రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రానికి రాధే శ్యామ్ అనే టైటిల్ వినిపిస్తోంది. సున్నితమైన ప్రేమకథలా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్, పూజాహెగ్డే మధ్య ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయట. ప్యూర్ అండ్ సెన్సిబుల్ లవర్స్ గా నటిస్తున్న ప్రభాస్, పూజాహెగ్డేల కెమిస్ట్రీ సినిమాలో హైలెట్ గా అవుతోందట. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ సన్నివేశాలు ప్రేక్షకులకు కంటతండి పెట్టించడం ఖాయమని అనుకుంటున్నారు. ప్రభాస్, డార్లింగ్ సినిమా తర్వాత ఓ పూర్తి స్థాయి ప్రేమకథలో నటిస్తుండటం లేడీ ఫ్యాన్స్ కు పండగే అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: