మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరియర్ ప్రారంభించి దశాబ్దాలు గడిచిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వరకు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మొత్తం 150కిపైగా సినిమాల్లో నటించారు. కాగా ఈ 150 సినిమాల్లో  ఎంతో మంది హీరోయిన్లు చిరంజీవి సరసన నటించి మెప్పించారు. అయితే చిరంజీవితో ఎంతో మంది కొత్త హీరోయిన్లు పాత హీరోయిన్లు నటించినప్పటికీ ప్రేక్షకులకు దగ్గర అయిన హీరోయిన్లు  మాత్రం చాలా తక్కువ అనే చెప్పాలి. ఇలా చిరంజీవితో అప్పట్లో వరుస సినిమాలలో నటించి బెస్ట్ జోడిగా అనిపించుకుని ప్రేక్షకులను తెగ ఆకర్షించిన హీరోయిన్లలో ముందువరుసలో ఉండేది శ్రీదేవి. అప్పటి ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వెంకటేష్ వరకు అందరు సరసన నటించి శ్రీదేవి  ఎంతో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. 

 

 

 ఇక చిరంజీవి శ్రీదేవి జోడిగా నటించిన సినిమాలు కొన్ని అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయిపోయింది. కొంత సమయం లోనే ఈ జోడి ప్రేక్షకులకు ఫేవరేట్ గా మారిపోయింది. రాణీకాసుల రంగమ్మ అనే సినిమాతో ఈ  ఇద్దరి జోడి మొదటి సారి కలిసి నటించి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. సినిమాలో  ఇద్దరి జోడి మధ్య జరిగే సంభాషణలు నటన ప్రేక్షకులకు ఈ జోడిని మరింత దగ్గర చేసింది. ఆ తర్వాత వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరి జోడి కేవలం మెగా అభిమానులకే కాదు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే బెస్ట్ జోడీగా ఈ సినిమాలో  అందరిని అలరించింది అని చెప్పాలి. 

 

 

 స్వర్గం నుంచి దిగి వచ్చిన శ్రీదేవి భూమ్మీద ఉండే చిరంజీవితో కొన్ని రోజులు గడపడం.. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు ఆ తర్వాత వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఆ తర్వాత చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ఎస్పి పరశురాం సినిమా కూడా మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలో కూడా శ్రీదేవి చిరంజీవి మరోసారి జోడీ గా ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ రీల్  జోడి రియల్ లైఫ్ లో కూడా జోడి అయితే ఎంత బాగుండు అని ప్రేక్షకులు భావించినప్పటికీ అది కాస్త కలగానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: