‘డీడీఎల్ జే’గా ప్రేక్షకాభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ సినిమా ముంబైలోని మరాఠా మందిర్ లో ఏకధాటిగా 20 ఏళ్లకు పైగా రన్ అయి సంచలన రికార్డు నమోదు చేసింది. గతంలో చైనాలో ఓ సినిమా ఇలానే ఆడిన రికార్డును డీడీఎల్ జే తుడిచిపెట్టేసింది. డీడీఎల్ జే విడుదలై 25 ఏళ్లైన సందర్భంగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదల చేయనుంది యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ. సెకండ్ రిలీజ్ లే లేని ఈ రోజుల్లో 25 ఏళ్ల కిందటి అద్భుతాన్ని మళ్లీ ప్రపంచ దేశాల్లో విడుదల చేయడమంటే ఈ సినిమాకు ఉన్న ఆదరణ స్థాయిని అర్ధం చేసుకోవచ్చు.
షారుఖ్ ఖాన్, కాజోల్ జంట తెరపై కనువిందు చేసింది. ఆదిత్య చోప్రా కథ, కథనం, దర్శకత్వం సినిమాను ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకునేలా చేశాయి. అందుకే ప్రేక్షకులకు కాలక్షేపంగా మారిపోయింది ఈ సినిమా. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా ప్రపంచ ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసేందుకు సిద్ధమవడం విశేషం. 2005లో సినిమా విడుదలై పదేళ్లయిన సందర్భంగా అప్పట్లో యశ్ రాజ్ ఆరోజు సినిమా చూసినవారందరికీ ఆడియో క్యాసెట్లు ఉచితంగా ఇచ్చారు.