ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందని అలానే మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు పరశురామ్ ఈ సినిమా తీయనున్నాడని అంటున్నారు. కాగా దీని తర్వాత దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కె.ఎల్.నారాయణ నిర్మాతగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ బాబు ఒక భారీ ప్రతిష్టాత్మక సినిమా చేయనున్నారు. ఇటీవల తన నెక్స్ట్ సినిమా మహేష్ తోనే చేయనున్నట్లు రాజమౌళి కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పనుల్లో ఎంతో బిజీగా ఉన్న రాజమౌళి మరో ఆరు నెలల వరకు ఫ్రీ అయ్యే అవకాశం లేదని అలానే అది పూర్తయిన అనంతరం ఆయన కొంత గ్యాప్ తీసుకుంటారని అంటున్నారు.
అందువల్ల ఈలోపు సమయం వేస్ట్ చేయడం ఇష్టం లేని మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాని లైన్లో పెట్టారని అంటున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకు సంబంధించి కథ, కథనాలతో పాటు పూర్తి స్క్రిప్టు సిద్ధం చేశారని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా అతి త్వరలో ప్రారంభం అవుతుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంత వరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాలి....!!