పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి వరుస క్రేజీ సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాడు. వకీల్ సాబ్ మరో షెడ్యూల్ తో పూర్తి చేస్తున్న పవర్ స్టార్ తన నెక్స్ట్ క్రిష్ డైరక్షన్ లో చేస్తున్న సినిమాను డిసెంబర్ నుండి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. క్రిష్ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో ఒక సినిమా ఆ తర్వాత సురేందర్ రెడ్డి సినిమా కూడా ఎనౌన్స్ చేశాడు పవర్ స్టార్.

ఇక లేటెస్ట్ గా సాగర్ చంద్ర డైరక్షన్ లో కూడా పవన్ సినిమా కన్ ఫా అయ్యింది. మళయాల సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా వస్తున్న సినిమాకు సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తారని టాక్. ఇక ఇదే కాకుండా త్రివిక్రం తో కూడా ఓ సినిమా ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. పవర్ స్టార్ వరుస సినిమాలతో సూపర్ బిజీ అయ్యడు. చూస్తుంటే 2023 వరకు షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నట్టు అనిపిస్తుంది.

వకీల్ సాబ్ నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తుండగా క్రిష్ సినిమా 2021 సెకండ్ హాఫ్ లో వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇక హరీష్ శంకర్ సినిమా వచ్చే ఏడాది మిడిల్ స్టార్ట్ అయినా సురేందర్ రెడ్డి సినిమా 2021 చివర్లో మొదలవుతుంది. అయితే ఈమధ్యలోనే ఏకే రీమేక్ కు ఓ పాతిక రోజులు డేట్స్ ఇచ్చి త్వరగా ఆ సినిమా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు పవర్ స్టార్. తప్పకుండా ఈ సినిమా స్పెషల్ గా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు.                                                     

మరింత సమాచారం తెలుసుకోండి: