రాజమౌళి బాహుబలి సినిమా తీసిన తర్వాత ఆయన నెక్స్ట్ ఏం చేస్తాడో అని ఎదురుచూశారు ప్రేక్షకులు. అయితే ఎవరి అంచనాలకు అందని కాంబినేషన్ తో ఎన్.టి.ఆర్, రాం చరణ్ తో క్రేజీ మల్టీస్టారర్ గా ఆర్.ఆర్.ఆర్ సినిమా తీస్తున్నాడు జక్కన్న. సినిమాలో రామరాజుగా రాం చరణ్, కొమరం భీం గా ఎన్.టి.ఆర్ సర్ ప్రైజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్స్ సినిమాపై సూపర్ క్రేజ్ తెచ్చాయి. బాహుబలి తర్వాత అదే రేంజ్ అంచనాలతో ఆర్.ఆర్.ఆర్ వస్తుంది.

ఇక ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ షురూ అయ్యింది. కె.జి.ఎఫ్ తో సౌత్ లో తన సత్తా చాటుతున్న డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఈమధ్యే వచ్చిన కె.జి.ఎఫ్ 2 టీజర్ తో సినిమాపై అంచనాలు డబుల్ అయ్యేలా చేశాడు. కె.జి.ఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. సలార్ అంటూ ఓ సెన్సేషనల్ మూవీకి రంగం సిద్ధం చేశారు. ప్రభాస్ తో సినిమా అది కూడా కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో అనగానే అటు బాహుబలి, ఇటు కె.జి.ఎఫ్ రెండు సినిమాల క్రేజ్ సలార్ సినిమాకు యాడ్ అవనుంది.

సలార్ గా గర్జించడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆదిపురుష్, సలార్ రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నాడు. అందుకే రెండు సినిమాలను మొదలు పెట్టేస్తున్నాడు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. ఆ సినిమాను కూడా 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సలార్ సినిమా కూడా 300 కోట్ల పైన బడ్జెట్ తో వస్తుందని టాక్.                 

మరింత సమాచారం తెలుసుకోండి: