టాలీవుడ్ నటుడు శ్రీనివాస్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు సినిమాలలో మంచి కమెడియన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని ఎంత గానో ఆకట్టుకున్నాడు."గీతాంజలి", "జయమ్ము నిశ్చాయమ్మురా","ఆనందో బ్రహ్మ " వంటి సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు హీరో గా సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ మరియు నవీనారెడ్డి ముఖ్య తారాగణం తో ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకం పై కెవి రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మిస్తోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'ప్లాన్-బి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 23 న విడుదల కు సిద్ధంగా ఉంది.


ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కెవి రాజమహి మాట్లాడుతూ 'ప్లాన్ బి చిత్రం ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.ఇక ఆద్యంతం ఉత్కంఠం తో థ్రిల్లింగ్ అంశాలతో సాగె కథ ఇది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కనీసం తన మొబైల్ ఫోన్ చూసే అవకాశం కూడా ఉండదు అంత ఉత్కంఠం గా ఉంటుంది. మా చిత్రాన్ని సెన్సార్ వారు చూసి సినిమా అద్భుతంగా ఉంది, ఇలాంటి కథని మేము ఎప్పుడు చూడలేదు అని ప్రశంసించి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మురళి శర్మ గారు, సూర్య వశిష్ఠ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ వీళ్లందరి నటన మా చిత్రానికే ఒక హైలైట్. మా చిత్రాన్ని ఏప్రిల్ 23 న విడుదల చేస్తున్నాము' అని తెలిపారు.ఇక ఈ సినిమాతో కూడా శ్రీనివాస్ రెడ్డి మంచి కొట్టాలని కోరుకుందాం. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: