
బాలీవుడ్ చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న హీరోల్లో అక్షయ్ కుమార్ కూడా ఒకడు. అక్షయ్ ను అందరు కూడా 'ఖిలాడీ' అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే అక్షయ్ ప్రేమ కధల వలన అతన్ని అలా పిలుస్తారు. తనతో నటించిన హీరోయిన్స్ కు ప్రేమ మాటలు చెప్పి అందరికి తనతో పెళ్లి కలలు తెప్పించాడు. వాళ్లలో రవీనా టండన్, శిల్పాశెట్టితో పాటు పూజా బాత్రా, అయేషా జుల్కా వంటి నటీమణులూ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో అక్షయ్ కుమార్ ప్రేమ కథ 2 గురించి. ఈ కధలో హీరో అక్షయ్ అయితే హీరోయిన్ మాత్రం శిల్పాశెట్టి. ఇదీ కూడా ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విఫలమవడానికి కారణం మాత్రం అక్షయ్ కుమారే. ఆ ప్రేమ మొదలైంది 'మై ఖిలాడీ తూ అనాడీ' సినిమా సెట్స్లో. అప్పుడప్పుడే గుర్తింపులోకి వస్తోంది శిల్పాశెట్టి. ఆమె అమాయకత్వం అతణ్ణి ఆకర్షించింది. అలాగే అక్షయ్ మాటల గారడీని చూసి శిల్ప కూడా అతనికి మనసిచ్చేసింది శిల్పాశెట్టి.
అప్పటికే అతను రవీనా టాండన్ ప్రేమలో తలమునకలై ఉన్నాడు.రవీనా ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లాడు. కానీ శిల్ప ఆ విషయాన్నీ గమనించలేదు. తన కెరీర్ కన్నా అక్షయే ముఖ్యమనుకుంది. అతణ్ణి పెళ్లి చేసుకుని స్థిరపడాలనీ నిర్ణయించుకుంది. రవీనా, శిల్ప ఇద్దరికీ మంచి స్నేహం ఉంది. కాని అతని మాయలో శిల్ప ఉందన్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుంది. అది గ్రహించాక అక్షయ్తో బంధాన్ని తెంచేసుకుంది. కానీ శిల్ప మాత్రం అక్షయ్ ను గుడ్డిగా నమ్మింది. తెరమీదా ఈ జంటకు క్రేజ్ పెరగడంతో తర్వాత రెండు సినిమాల్లోనూ (ఇన్సాఫ్, జాన్వర్) అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి జత కట్టారు. మూడో సినిమా 'ధడ్కన్' కూడా మొదలైంది. ఆ సమయంలోనే అక్షయ్ ప్రవర్తనలోని తేడాను గమనించింది శిల్ప. హడావిడిగా ఉంటున్నాడు. అబద్ధాలు చెబుతున్నాడు అని గ్రహించింది.విషయం ఏంటా అని ఆరా తీసే సమయానికి జరగవలిసిన ఘోరం జరిగిపోయింది. ట్వింకిల్ ఖన్నాతో డ్యుయేట్లు పాడుకుంటున్నట్టు తెలిసింది.అప్పటికి గాను తనకి అర్ధం అయింది తాను మోసపోయానని. అప్పటికప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకోవాలనుకుంది. కాని ఆ సినిమా యూనిట్ నష్టపోకూడదని సహనం వహించింది.మనసులో బాధను ఉంచుకుని షూటింగ్ పూర్తి చేసింది. సినిమా పూర్తయిన వెంటనే అక్షయ్కి గుడ్బై చెప్పింది.
శిల్పతో తెగతెంపులు అయిన కొద్ది రోజుల్లోనే ట్వింకిల్ కన్నాని పెళ్లి చేసుకుని 'ఫ్యామిలీ మాన్' ఇమేజ్లోకి ఇమిడిపోయాడు.'నాతో ప్రేమ నటిస్తూనే అక్షయ్ ఇంకో అమ్మాయితో జీవితాన్ని పంచుకునే ప్లాన్ చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడిలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాను కానీ.. ఆ నిజం తెలిసినప్పుడు ఎంతో బాధ పడ్డాను.అక్షయ్ నన్ను యూజ్ చేసుకున్నాడు. తనకు కావల్సిన మనిషి దొరకగానే నన్ను పక్కకు పడేసాడు.ఈ విషయంలో ట్వింకిల్ ను తప్పు పట్టను. ఎందుకంటే నా మనిషి అనుకున్న వ్యక్తే సరైనవాడు కాదు. నా కోపమంతా అతని మీదే. నా జీవితంలో నేను మరిచిపోయిన అధ్యాయం అతను. లైఫ్లో అతనితో సినిమాలు చేయను' అని చెప్పింది శిల్పాశెట్టి ఒక ఇంటర్వ్యూలో. శిల్ప అన్నట్టుగానే 'ధడ్కన్' ఆ ఇద్దరి ఆఖరి సినిమా అయింది. కిందటేడుకు అది విడుదలై ఇరవై ఏళ్లు. .