ప్రస్తుతం దేశమంతా కరోనా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా రెండవ దశలో భారీ ఎత్తున కేసులు నమోదు అవడమే కాక మరణాలు కూడా సంభవిస్తున్నాయి. మొదటి దశ కంటే రెండో దశలో కేసులతో పాటు మరణాలు రెట్టింపయ్యాయి. ఒకరకంగా ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తి వేస్తున్న పరిస్థితి అక్కడక్కడా కనిపిస్తోంది.. ఇంతటి కష్టంలో కూడా రియల్ హీరోగా నిలబడుతున్న సోనూసూద్ అనేక రకాలుగా సహాయం చేస్తూ వస్తున్నారు.. కొన్ని చోట్ల ప్రభుత్వ అధికారులు సోనూసూద్ హెల్ప్ తీసుకుంటున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


. సినిమాలో విలన్ వేషాలు వేస్తూ వచ్చిన సోనూసూద్ కు ఈ కరోన రియల్ హీరో స్టేటస్ తెచ్చిపెట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సోనూసూద్ ఫోటోకు పాలతో అభిషేకం జరిపారు అక్కడి స్థానికులు. పులి శ్రీకాంత్ అనే స్థానిక వ్యక్తి ఈ కార్యక్రమం జరిపారు. ఇలా అయినా సోనూసూద్ ని అందరూ ప్రేరణగా తీసుకుని ఇతరులకు సహాయం చేయాలని ఉద్దేశంతో పాలాభిషేకం చేశారని చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. 


కొందరు సోనూసూద్ చేస్తున్న సహాయం ఇలాంటి గుర్తింపు వల్ల రెట్టింపు అవుతుందని కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం సోనూసూద్ కష్టపడి అందరి అవసరాలను తీరుస్తూ ఉంటే మీరు ఆయన ఫోటోల మీద పాలు వృధా చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సోనూసూద్ ప్రస్తుతం టాలీవుడ్ లో చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక అలాగే ఆయన హీరోగా డైరెక్టర్ క్రిష్ ఒక సినిమా కథ సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: