రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా తర్వాత ఇంతవరకు ఏ సినిమాను విడుదల చేయలేదు. చేయడానికి నాలుగు సినిమాలు చేస్తున్న కూడా ప్రభాస్ విడుదల విషయంలో మాత్రం జాప్యం చేస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో జరుపుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా ఈ సినిమా విడుదల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా విడుదల కాకపోవడంతో సోషల్ మీడియాలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ కామెంట్లు పెడుతున్నారు ప్రభాస్ సినిమా త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి రాధేశ్యాం సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. ఓ వైపు కరోనా మరోవైపు సినిమా రీ షూటింగ్ ల కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తుంది. సినిమా అనుకున్నట్లు రాలేదని ప్రభాస్ సాహో ఫలితం వల్ల ఈ సినిమాను పలుమార్లు  రీ షూట్ లు చేయించగా తాజాగా కూడా ప్రభాస్సినిమా రీ షూట్ చేయిస్తున్నాడట. 

ప్రభాస్ ఇలా రీషూట్ మీద రీ షూట్ లు చేసుకుంటూ పోతే సినిమాను ఎప్పుడు చూసేది అంటూ ప్రభాస్ అభిమానులు వాపోతున్నారు. రాధే శ్యామ్ సినిమా ఇలా రీషూట్ చేసుకుంటూ పోతే ఈ సంవత్సరం కూడా ఆ సినిమాని చూడలేము కావచ్చు అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ నేపథ్యంలో చాలా తక్కువ గ్యాప్ తోనే ఈ రెండు సినిమాలు విడుదల అవుతాయి. బాలీవుడ్ ఎంట్రీ చేస్తున్న ఆదిపురుష్ నాగ్ అశ్విన్ తో సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రాలు కూడా లైన్ లో పెట్టాడు ప్రభాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: