శంకర్ దర్శకత్వంలో
విక్రమ్ హీరోగా వచ్చిన అపరిచితుడు
సినిమా సౌత్ లో క్రియేట్ చేసిన ప్రభంజనం గురించి అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా యావత్ భారతదేశాన్ని ఆకర్షించిన ఈ
సినిమా లంచగొండితనం నేపథ్యంలో తెరకెక్కింది. మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల చేత ఆహా అనిపించుకున్నాడు విక్రమ్. ఈ సినిమాతోనే మరింత క్రేజ్ ను సంపాదించుకును స్టార్ హీరోగా ఎదిగాడు. అప్పటివరకు తమిళనాడు వరకే పరిమితమైపోయిన
విక్రమ్ క్రేజ్ దక్షిణాదిన పాకడం మొదలైంది.
వరుసగా ఆయన సినిమాలు తెలుగులో మలయాళంలో కన్నడంలో డబ్ అయ్యి విడుదల కావడం మొదలైంది. ఆ విధంగా ఇప్పుడు సౌత్ మొత్తంలో లో వెరైటీ నటుడుగా
విక్రమ్ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. 2005 లో వచ్చిన ఈ చిత్రం సృష్టించిన రికార్డులు ఇప్పటికీ ఏ
సినిమా తుడిచి పెట్టలేదని చెప్పాలి. తెలుగులో కూడా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 13 కోట్ల షేర్ వసూలు చేసి డబ్బింగ్ సినిమాలలోనే రికార్డును సృష్టించింది. ఎప్పుడు
టీవీ లో ప్రసారమైనా ఈ సినిమాకు భారీ టిఆర్పి రేటింగ్ రావడం విశేషం.
ప్రస్తుతం ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ హీరోగా
శంకర్ హిందీలో
రీమేక్ చేస్తున్నాడు. త్వరలోనే పట్టాలు ఎక్కనుంది ఈ సినిమా. ఇకపోతే ఈ అపరిచితుడు అనే టైటిల్ ను ముందుగా
హీరో రాజశేఖర్ వాడుకోవాలని చూశారట. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఒకప్పుడు
శ్రీను వైట్ల దర్శకత్వంలో అపరిచితుడు
సినిమా చేయాల్సి ఉంది. అందులో
రాజశేఖర్ హీరోగా నటించాలని అనుకున్నాడు. అయితే ఈ
సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
శ్రీను వైట్ల తన మొదటి
సినిమా కంటే ముందుగానే అపరిచితుడు అనే టైటిల్ తో
రాజశేఖర్ తో సినిమాను కన్ఫామ్ చేసుకోగా పది శాతం షూటింగ్ అయిపోయిన తర్వాత నిర్మాత
చేతులెత్తేశాడు. దాంతో ఆ ప్రాజెక్టు మళ్ళీ మొదలు కాలేదు. ఆ విధంగా
రాజశేఖర్ మిస్ చేసుకున్న
సినిమా టైటిల్
విక్రమ్ హీరోగా అపరిచితుడుగా తెలుగులో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.