టాలీవుడ్ లో టాప్
హీరోయిన్ గా వెలుగొందుతున్న
హీరోయిన్ రష్మిక మందన కన్నడలో తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో చలో అనే
సినిమా ద్వారా పరిచయమై కుర్రకారును విశేషంగా ఆకట్టుకుంది. ఆ
సినిమా తర్వాత ఆమె నటించిన గీత గోవిందం
సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా ఆమెకు యువతలో క్రేజ్ ఏర్పడింది. ఆమెకు భారీ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. దాంతో
సినిమా అవకాశాలు పెరిగి పోయాయి.
విజయ్ దేవరకొండ తో వరసగా
డియర్ కామ్రేడ్ వంటి హిట్ సినిమాలో కూడా నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది.
భీష్మ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న
రష్మిక తెలుగులో టాప్
హీరోయిన్ గా ఎదిగింది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు
సినిమా తర్వాత ఆమెను ఎవరూ ఆపలేకపోయారు. ప్రస్తుతం
అల్లు అర్జున్ హీరోగా
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్లో సైతం ఈమె ఎంట్రీ ఇవ్వబోతుండడం విశేషం. అక్కడ మూడు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీగా ఉంది.
సిద్ధార్థ్ మల్హోత్రా తో
మిషన్ మంగళ్ అమితాబ్ బచ్చన్ గుడ్ బై సినిమాలు ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నాయి.
తెలుగులో శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు అనే
సినిమా చేస్తుంది. తమిళంలో కూడా ఇటీవలే కార్తీ జోడీగా చేసిన
సుల్తాన్ సినిమా తో పరిచయమై అక్కడ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రెండు చేతులా సంపాదిస్తున్న రష్మీక సినిమాలు, బ్రాండ్లు,
టీవీ కమర్షియల్స్ ద్వారా 35 కోట్ల దాకా సంపాదించిందని తెలుస్తుంది. ఆమె నెలసరి సంపాదన 4 కోట్ల నుంచి ఐదు కోట్ల దాకా ఉంటుందట. ఏదేమైనా ప్రస్తుతం
రష్మిక అన్ని భాషలలో నటిస్తూ దేశంలోనే పెద్ద
హీరోయిన్ గా వెలుగొందుతూ అందరిలో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంటుంది.