తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ బిరుదును సంపాదించుకున్న చిరంజీవి కొంతం కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఆ తరువాత ఖైదీ 150 సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చారు. ఆయన రీఎంట్రీ తరువాత వరుస సక్సెస్ లు సాధిస్తూ మార్కెట్ ను పెంచుకుంటున్నారు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుండగా లూసిఫర్ రీమేక్ షూటింగ్ వచ్చే నెలలో మొదలు కానుందని సమాచారం.

అంతేకాదు.. చిరంజీవి మరికొందరు దర్శకులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ సినిమాల షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయనే అంశంపై ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే టాలెంటెడ్ నటుడు సాయికుమార్ తాజాగా చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలను వెల్లడించారు. ఇక నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రతిభతో సాయికుమార్ గుర్తింపును సంపాదించుకున్న సంగతి అందరికి తెలిసిన విదితమే.

అయితే సాయికుమార్ రాజశేఖర్, సుమన్ లకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేశారు. ఇక ప్రస్తుతం సాయికుమార్ SR కళ్యాణ మండపం సినిమాలో విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని తాను ఛాన్స్ అడిగితే రొటీన్ పాత్రలే చేస్తున్నామని కామెంట్లు చేశారని సాయికుమార్ వెల్లడించారు. అయితే చిరంజీవిని తాను అన్నయ్య అని పిలుస్తానని ఏదైనా మంచి పాత్రలో నటించాలని ఉందని అడగగా కొత్తగా చేయమని తనకు చెప్పారని సాయికుమార్ తెలిపారు.

ఇక SR కళ్యాణమండపంలోని పాత్ర ఒక లెవెల్ సంతృప్తిని ఇస్తుందని ఈ సినిమాలో తాను కొత్తగా కనిపిస్తానంటూ సాయికుమార్ చిరంజీవి విమర్శకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారంట. అంతేకాక.. భవిష్యత్తులో కూడా వైవిధ్యమైన సినిమాల్లో నటించి కొత్తనటుడిని బయటకు తీస్తానని సాయికుమార్ తెలిపారు. కాగా ఈ సినిమాతో సాయికుమార్ నటుడిగా మరో హిట్ ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: