ఇదంతా ఇలా ఉంటే అప్పట్లో ఒక హీరో వల్ల త్రివిక్రం చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొన్నాడు.ఇక అసలు విషయానికి వస్తే.. త్రివిక్రమ్ 2010 వ సంవత్సరం లో మహేష్ తో కలిసి ఖలేజా సినిమాను నిర్మించాడు.ఈ మూవీలో అనుష్క కూడా నటించింది. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలని విషయం మహేష్ బాబు అభిమానులకు ముందుగానే తెలియడంతో.. త్రివిక్రమ్ కు మహేష్ అభిమాని ఫోన్ చేసి.. కచ్చితంగా మహేష్ బాబు పుట్టిన రోజున ఈ సినిమా విడుదల చేయాలి లేదంటే నీకు తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి అని ఒక బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
త్రివిక్రమ్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా కామెడీగా తీసుకున్నాడు. అయితే ఇదంతా అప్పట్లోనే జరిగిందని. ఇప్పుడైతే ఎటువంటి హీరోల నుండి ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకే తను ముందుగానే ఈ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు అని చెప్పుకొచ్చాడు.
ఎక్కువగా త్రివిక్రమ్ స్టార్ హీరోలతో నటించేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక అప్పట్లో కూడా చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణ వంటి హీరోల సినిమాలు కూడా ప్రకటించిన సమయానికి విడుదల కాకపోతే అభిమానులు డైరెక్టర్లకు ఫోన్ చేసి బెదిరించే వారు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ అలవాటు ఇప్పటికీ కూడా కొనసాగుతతూ ఉండడం గమనార్హం. అతి త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో కూడా మరొక మూవీ రాబోతున్నట్లు తెలుపుకొచ్చారు త్రివిక్రమ్.