టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన 'నాటు నాటు' అనే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ముఖ్యంగా ఈ పాటలో ఎన్టీఆర్, చరణ్ కలిసి వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కాగా ఈ పాటలో ఇద్దరు హీరోలు కలిసి వేసిన డాన్స్ స్టెప్స్ గురించి జూనియర్ ఎన్టీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యూట్యూబ్లో ఈ పాటకు 26 మిలియన్ల వ్యూస్ దక్కాయి.

 అయితే ఈ పాట గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.." ఈ పాట షూటింగ్ సమయంలో నాటు నాటు డాన్స్ మూవ్ మెంట్స్ పై తనకు పెద్దగా అంచనాలు లేవని అన్నాడు ఎన్టీఆర్. కానీ ఈ పాట కోసం టేకుల మీద టేకులు తీసుకోవాల్సి వచ్చిందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. నాటు నాటు పాటకోసం తన కాళ్ళు, రామ్ చరణ్ కాళ్లు పర్ఫెక్ట్ టైమింగ్ తో కదలాలని రాజమౌళి గారు చెప్పారు. ఇక పాట విషయంలో నచ్చక పోతే మళ్ళీ రీటేక్ అనేవారని అలా రాజమౌళి ఈ పాట విషయంలో అలా పట్టు పట్టడానికి అసలు కారణం ఇప్పుడు అర్థమైందని ఎన్టీఆర్ అన్నాడు. నాటు నాటు స్టెప్ కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 నుంచి 18 కోట్లు తీసుకున్నామని ఎన్టీఆర్ తెలిపారు.

 అయితే ఈ పాట విడుదలైన తర్వాత తాము పడ్డ కష్టమంతా మరిచి పోయాను అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. షూటింగ్ లో ఎన్టీఆర్ చరణ్ ఇద్దరూ పర్ఫెక్ట్ టైమింగ్ తో స్టెప్ వేశారు కాబట్టే ఈ రోజు ఈ పాట యావత్ ప్రేక్షక లోకాన్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా గురించి ఒక్కమాటలో ఎన్టీఆర్ చెబుతూ ఈ సినిమా అందరి అంచనాలకు మించి ఏ విధంగా ఉంటుందని చెబుతూ మరోసారి తన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలను తారా స్థాయికి చేరాడు ఎన్టీఆర్. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: