జబర్దస్త్ స్కిట్లలో హైపర్ ఆది టీంలో కమెడియన్ గా చేసిన ఈయన ఎప్పుడు కూడా ఆది చేత పంచులేయించుకుంటూ మనల్ని నవ్విస్తూ కనిపిస్తాడు. కానీ ఇటీవల కొన్ని నెలలు పాటు ఆయన జబర్దస్త్లో కనిపించలేదు. దీంతో రైజింగ్ రాజు కి ఏమైందని అంతా ఖంగారు పడ్డారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు..? ఎందుకు జబర్ధస్త్ లో కనిపించదంలేదు? అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు. అంతేకాదు రైజింగ్ రాజు లేకుండానే దొరబాబు, పరదేశీ లాంటి వాళ్ళతో ఆది స్కిట్స్ చేయడంతో అందరు ఇక ఆయన జబర్దస్ట్ మానేసాడు అనుకున్నారు. కానీ సడెన్ గా మళ్లీ ఆయన తెర పై కనిపించడంతో ఆయన అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.
నిజం చెప్పాలి అంటే హైపర్ ఆదితో రాజుకు గొప్ప అనుబంధం ఉందనే చెప్పాలి. ఆది రాజు కు ఎన్నో సార్లు హెల్ప్ చేస్తూ వచ్చాడు. తనకు టీమ్ లీడర్గా గౌరవం ఇవ్వడం తో పాటు.. రెమ్యూనరేషన్ విషయంలోనూ పెద్ద పీట వేస్తాడని గతంలోనే రాజు ఇంటర్వ్యులల్లో ఎన్నో సార్లు చెప్పారు. తాజాగా మరోసారి ఆది చేసిన హెల్ప్ ని గుర్తు తెచ్చుకుంటూ రైజింగ్ రాజు కన్నీటి పర్యంతమైయారు. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రాం లో గెస్ట్ గా వచ్చిన రాజు ఆది గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన తీరు అందరినీ కదిలించేస్తోంది.
కరోనా టైంలో ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అని. అదే టైంలో ఆయనకు మనవరాలు పుట్టిందట. ఇక దీంతో రాజు బయట తిరిగితే పాపకు ఇబ్బంది అవుతుందని ఇంట్లోనే ఉన్నాడట. కానీ ఆ టైంలో కూడా ప్రతి స్కిట్కూ పారితోషకం అందుకున్నాడట రాజు. రాజు పరిస్థితి అర్థం చేసుకున్న ఆది.. ఆయన స్కిట్లలో లేకపోయినా ప్రతి నెలా రాజుకు పారితోషకం పంపించేవాడట. వయసులో చిన్నవాడు కాబట్టి పాదాభివందనం చేయలేకపోతున్న కానీ లేకుంటే ఖచ్చితంగా అతడికి పాదాభివందనం చేసేవాడిని అంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో హైపర్ ఆదిని పొగుడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు.