జబర్దస్త్..పేరు చిన్నదే కావచ్చు కానీ ఈ షోనే చాలా మంది కమెడియన్స్ కు లైఫ్ ఇచ్చి అన్నం పెట్టింది. యస్ .. ఇది నిజం. జబర్ధస్త్ షో ద్వారా వాళ్లలో టాలేంట్ ను కోట్ల మంది ప్రజలకు పరిచయం చేసిన కమెడియన్స్ ఎంతో మంది ఉన్నారు. ఒక్కప్పుడు తినడానికి నాలుగు మెతుకులు అన్నం కూడా లేని వాళ్ళు  ఈరోజు లక్షల రూపాయలను  సంపాదించుకుంటున్నారు అంటే దానికి కారణం ముమ్మాటికి జబర్దస్త్ షో నే. ఈ విషయాని స్వయంగా ఆ కమెడియన్స్ నే చెప్పుకురావడం గమనార్హం.

 బుల్లితెరపై జబర్దస్త్ ప్రోగ్రాం  ఒక సాదాసీదా కామెడీ షో గా ప్రారంభమై ..లాస్ట్ కి ఎంతో మంది కమెడియన్స్ కు జీవితాని ఇచ్చిన షో గా జబర్దస్త్ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బుల్లితెర పై ఏదైనా  షో ని చూసి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటున్నారు అంటే అది కేవలం జబర్దస్థ్ షో అని అంటున్నారు ఫ్యాన్స్. ఈ షో కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అనడంలో సందేహం లేదు. ఇక ఈ కమెడి షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. అలాంటి వారిలో రైజింగ్ రాజు కూడా ఒకరు.
 
జబర్దస్త్ స్కిట్లలో హైపర్ ఆది టీంలో కమెడియన్ గా చేసిన ఈయన ఎప్పుడు కూడా ఆది చేత  పంచులేయించుకుంటూ మనల్ని నవ్విస్తూ కనిపిస్తాడు. కానీ ఇటీవల కొన్ని నెలలు  పాటు ఆయన జబర్దస్త్‌లో కనిపించలేదు. దీంతో రైజింగ్ రాజు కి ఏమైందని అంతా ఖంగారు పడ్డారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు..? ఎందుకు జబర్ధస్త్ లో కనిపించదంలేదు? అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు.  అంతేకాదు రైజింగ్ రాజు  లేకుండానే దొరబాబు, పరదేశీ లాంటి వాళ్ళతో ఆది స్కిట్స్ చేయడంతో అందరు  ఇక ఆయన జబర్దస్ట్ మానేసాడు అనుకున్నారు. కానీ సడెన్ గా మళ్లీ ఆయన తెర పై కనిపించడంతో  ఆయన అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.

 నిజం చెప్పాలి అంటే హైపర్  ఆదితో రాజుకు గొప్ప అనుబంధం ఉందనే చెప్పాలి. ఆది  రాజు కు ఎన్నో సార్లు హెల్ప్  చేస్తూ వచ్చాడు. తనకు టీమ్ లీడర్‌గా గౌరవం ఇవ్వడం తో పాటు.. రెమ్యూనరేషన్ విషయంలోనూ పెద్ద పీట వేస్తాడని గతంలోనే  రాజు ఇంటర్వ్యులల్లో  ఎన్నో సార్లు చెప్పారు. తాజాగా మరోసారి ఆది చేసిన హెల్ప్ ని గుర్తు తెచ్చుకుంటూ రైజింగ్ రాజు కన్నీటి పర్యంతమైయారు.  శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రాం లో గెస్ట్ గా వచ్చిన రాజు   ఆది గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన తీరు అందరినీ కదిలించేస్తోంది.

కరోనా టైంలో ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అని. అదే టైంలో ఆయనకు మనవరాలు పుట్టిందట. ఇక దీంతో రాజు బయట తిరిగితే పాపకు ఇబ్బంది అవుతుందని ఇంట్లోనే ఉన్నాడట. కానీ  ఆ టైంలో కూడా  ప్రతి స్కిట్‌కూ పారితోషకం  అందుకున్నాడట రాజు. రాజు పరిస్థితి అర్థం చేసుకున్న ఆది.. ఆయన స్కిట్లలో లేకపోయినా ప్రతి నెలా రాజుకు పారితోషకం పంపించేవాడట. వయసులో చిన్నవాడు కాబట్టి పాదాభివందనం చేయలేకపోతున్న కానీ లేకుంటే ఖచ్చితంగా అతడికి పాదాభివందనం చేసేవాడిని అంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో హైపర్ ఆదిని పొగుడుతూ సోషల్ మీడియాలో  కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: