ఓటమి ఎరుగని దర్శకుడు గా కొనసాగుతున్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు రాజమౌళి. బాహుబలి లాంటి భారీ హిట్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పై మరింత అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారు. వినూత్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల అందరూ కూడా ఎదురు చూస్తున్నారు




 అయితే కరోనా వైరస్ కారణంగా ఇక ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరికి జనవరి 7వ తేదీన విడుదల చేస్తాం అని చిత్రబృందం ప్రకటించింది. ఇక పోతే ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ లను విడుదల చేస్తూ వస్తోంది చిత్ర బృందం. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ లుక్ ని విడుదల చేయగా లుక్ అందరిని ఆకర్షించింది. నేడు అటు రామ్ చరణ్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. అంతే కాకుండా మరో మూడు రోజుల్లో ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నాం అంటూ తెలిపింది.


 అయితే ఈ సినిమాపై అటు సామాన్య సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు అటు సినీ సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనేదానిపై ఎవరికి వారు భారీ రేంజ్ లోనే అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇటీవలే పూజా హెగ్డే ఆర్ ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఎమోషనల్ డ్రైవ్ ను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరు ఫెంటాస్టిక్ గా కనిపిస్తున్నారు. ఇక ఇద్దరిని స్క్రీన్ పైన చూడటానికి నేను వెయిటింగ్ అంటూ పూజా హెగ్డే ఒక పోస్టు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rrr