అయితే కిర్రాక్ పార్టీ చూసిన దర్శకుడు వెంకీ కుడుముల ఆమెకు ఛలో సినిమాలో అవకాశం ఇచ్చారు. మొదటి సినిమానే హిట్ కావడంతో రష్మికకు తెలుగులో కూడా వరుస అవకాశాలు దక్కాయి. అందుకే ఆమెకు తెలుగులోనే రష్మిక మందన్నాకు మంచి పేరు వచ్చింది. ‘ఛలో’ తర్వాత ఆమె చేసిన ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’, ‘పుష్ప’ వంటి భారీ హిట్ సినిమాలు అందుకుంది.రష్మిక మందన్నా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా ఆమెకు కలిసి రాలేదు. అయితే పుష్ప ఇచ్చిన క్రేజ్ తో ఆమె ఇప్పటికీ రచ్చ చేస్తోంది. ఆమె తెలుగులో ‘పుష్ప 2’ అనే సినిమా చేస్తోంది.
ఇక ‘మిషన్ మజ్ను’ మూవీతో హిందీ ఎంట్రీ ఇస్తున్న ఆమె అమితాబ్తో కలిసి ‘గుడ్బై’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ అమ్మడు వరుస ఫొటో షూట్స్తో పిచ్చెక్కిస్తుంది. కేక పెట్టించే అందాలతో కైపెక్కిస్తుంది. తాజాగా ఫిలింఫేర్ కోసం అదిరిపోయే అందాలు చూపిస్తూ యువతకు మత్తెక్కిస్తోంది.. గంట గంటకు కొత్త ఫోటో షూట్ లతో రచ్చ చెస్తుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో పుష్ప 2 సెట్స్ మీదకు వెల్లనుంది. ఆ సినిమా అమ్మాయికి ఎలాంటి క్రేజ్ ను అందిస్తుందొ, సుక్కు ఇప్పుడు ఎలా క్రియేట్ చేసాడో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి