హీరోగా , విలన్ గా ,  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను సినిమా ఇండస్ట్రీలో ఏర్పరచుకున్న ఆర్ మాధవన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఆర్ మాధవన్ తన సినిమాలతో కోలీవుడ్ , బాలీవుడ్ , టాలీవుడ్ ఇండస్ట్రీ లలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు . ఇలా హీరోగా , విలన్ గా ,  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సినిమా ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్న ఆర్ మాధవన్ తాజాగా రాకెస్ట్రీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే .

రాకెస్ట్రీ మూవీ నంబీ ఎఫెక్ట్’. ప్రముఖ శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది . ఈ సినిమా జులై 1 వ తేదీన విడుదల కాబోతుంది . ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన షారుక్ ఖాన్ మరియు కోలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరు ఆయన సూర్య గెస్ట్ రోల్ లలో నటించారు . ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం లోని సభ్యులు ఈ సినిమా ప్రమోషన్ లను ఇప్పటికే మొదలు పెట్టారు. అందులో భాగంగా ఆర్ మాధవన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు .

ఆర్ మాధవన్ తాజా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ... తాజా ఇంటర్వ్యూలో మాధవన్,  షారుక్ ఖాన్ గురించి మాట్లాడుతూ ...  ఈ సినిమాలో నటించడానికి షారుక్ ఖాన్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని చెప్పుకొచ్చాడు. అలాగే సూర్య కూడా ఈ సినిమాలో నటించడానికి ఒక రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు అని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: