కన్నడ నాట పుట్టి కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.ఇక దీని  తర్వాత చలో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సౌత్ లోనే టాప్ హీరోయిన్ లలో ఒకరిగా స్థానం సంపాదించింది ఈమె.ఇకపోతే ఆమె చేస్తున్న అన్ని సినిమాలు వరుస హిట్లుగా నిలుస్తున్న క్రమంలో ఆమెకు ఎనలేని క్రేజ్ లభిస్తుంది. ఇక ఆ మధ్య నేషనల్ క్రష్ గా కూడా గుర్తింపు పొందిన ఆమె ఈ మధ్య కొ౦న్దరు నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నది అంటూ కథనాలు బయటకు వచ్చాయి.అయితే ఈ మధ్యనే ఆమె ఒక పిల్లను కొనుక్కుని దానికి ఆరా అని పేరు కూడా పెట్టింది.

ఇక  ఆమె తనతో పాటు షూటింగ్ కి తీసుకు వెళ్లేందుకు ఆరాకి కూడా ఫ్లైట్ టికెట్ లు డిమాండ్ చేస్తుందనే వార్తలు బయటకు వచ్చాయి.ఇకపోతే సాధారణంగా ఇలాంటి విషయాల మీద హీరోలుగానీ, హీరోయిన్లు గానీ స్పందించారు. కాగా ఆ విషయం మీద రష్మిక మందన్న స్పందించింది.అయితే  ఇప్పటికే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కధనాలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అందులో ఒక వెబ్సైట్ కథనాన్ని షేర్ చేసిన ఆమె అది నిజం కాదని కొట్టిపారేశారు.అంతేకాదు ''కమాన్ మరీ ఇంత సిల్లీగా ఉండకండి, నిజంగా మీరు ఆరా(రష్మిక పెంపుడు కుక్క) నాతో పాటు ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నా ఆమె మాత్రం నాతో ట్రావెల్ చేయాలని అనుకోదు,

అంతేకాకుండా ఆమెకు హైదరాబాద్ లో ఉండటమే చాలా ఇష్టం'' అంటూ పేర్కొంది.ఇకపోతే  ఆ తర్వాత మరోసారి అని చెప్తూ... క్షమించండి ఇది చూసి నేను నవ్వు ఆపుకోలేక పోతున్నాను అని ఆమె పేర్కొంది. ఇక అది చూసిన ఒక నెటిజన్ ఇది మాత్రమే కాదు మేడం..మీగురించి ఇలాంటివి ఇంకా చాలా వస్తున్నాయని పేర్కొన్నాడు.అయితే అతడి కామెంట్స్‌పై రష్మిక స్పందిస్తూ 'ఇలాంటివి మీ దృష్టికి వచ్చినప్పుడు వెంటనే నాకు తెలియజేయండి ప్లీజ్‌' అని పేర్కొంది. పోతే  ప్రస్తుతం రష్మిక మందన్న నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్‌లో రణ్‌బీర్‌ సరసన యానిమల్‌ మూవీతో పాటు వంశీపైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న వరిసు సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు ఆమె నటించిన మరో రెండు బాలీవుడ్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: