నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా అఖండ మూవీ విజయం తో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

సినిమా బాలకృష్ణ కు కెరియర్ పరంగా 107 వ సినిమా కావడంతో ప్రస్తుతం ఈ సినిమా ఎన్ బి కే 107 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరినట్టు తెలుస్తోంది. ఈ మూవీ ని అఖండ సినిమాను విడుదల చేసిన తేదీ అయిన డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా పూర్తి కాగానే బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో బాలకృష్ణ సరసన బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కథానాయికగా నటించబోతున్నట్లు ఒక వార్త  వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇది వరకు బాలకృష్ణ బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ తో కలిసి నటించారు. అలాగే మరో సారి బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తో కూడా బాలకృష్ణ కలిసి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: