తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వెయిటింగ్ చిత్రాలలో మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా అని చెప్పవచ్చు.. ఈ సినిమా కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు అభిమానులు. SSMB -28 సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా కొన్ని నెలల క్రితమే పూర్తి చేసుకున్నారు. హీరోయిన్గా పూజా హెగ్డే కూడా నటిస్తున్నది. రీసెంట్గా మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం విజయవంతం కావడంతో త్రివిక్రమ్, రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు మహేష్ బాబు.


ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ బాబు కోసం ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కూడా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు శ్రీనివాస్. ఈ చిత్రానికి సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు.ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం ఒక సీనియర్ నటిని సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో కీలకమైన పాత్రలలో ఎప్పుడు కూడా ఒక సీనియర్ నటిమనులను తీసుకుంటూ ఉంటారు. అలా ఇప్పటివరకు నదియా, ఖుష్బూ హీరోయిన్స్ ను తన సినిమాలలో నటింప చేశారు.


ఇక త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రమ్యకృష్ణ కూడా వరుస సినిమాలలో బిజీగా ఉన్నది. బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక అంతే కాకుండా రెమ్యూనిరేషన్ విషయంలో కూడా హీరోయిన్లకు సమానంగా అందుకుంటోంది. లైగర్ సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. మరి మహేష్ బాబు సినిమాలో నటిస్తే ఒకవేళ ఎలాంటి పాత్రలో కనిపిస్తుందని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: