అయినా కూడా తాజాగా విడుదలైన చోట పెద్ద ఎత్తున జనాలు కూడా హాజరయ్యారు కేవలం ఒక్క చోటనే దాదాపుగా రూ. 17 లక్షల రూపాయలు వసూలు నమోదు అయ్యిందని సమాచారం. ఈ సినిమా స్ట్రిమింగ్ అయిన తర్వాత రాజమౌళికి దక్కిన గౌరవం చాలా అద్భుతమని చెప్పవచ్చు. సినిమా పూర్తి అయిన తర్వాత ఆడియన్స్ ఉద్దేశించి మాట్లాడేందుకు గాను స్క్రీన్ మీదకు రాజమౌళి పిలిపించడం జరిగిందట. ఆ సమయంలో ఆయనకు గౌరవిస్తూ ఆయన్ని అభినందిస్తు ప్రతి ఒక్కరు కూడా లేచి నిల్చోని క్లాప్స్ కొట్టడం జరిగింది.
దీంతో ఏ ఒక్క ఇండియన్ డైరెక్టర్కు కూడా ఇలాంటి అరుదైన ఘనత దక్కలేదని చెప్పవచ్చు. ఇలాంటి ఘనత కేవలం రాజమౌళికే దక్కిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ సినిమాలోని ప్రతి షాట్ కూడా నిజంగానే ఒక అద్భుతం లా అనిపించింది అని చెప్పవచ్చు.అందుకే రాజమౌళి విదేశీ గడ్డపై కూడా తన స్టామినా చూపించాడు అంటూ ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యారు రాజమౌళి.