తమిళ్,తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వస్తుందంటే ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో దళపతి విజయ్ వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.. తాజాగా వచ్చిన బీస్ట్ తో ఫ్లాప్ అందుకున్నాడు విజయ్. ఇక ఇప్పుడు తిరిగి సాలిడ్ హిట్ కొట్టాలన్న కసిమీద ఉన్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం లో చేస్తున్నారు.


సినిమా కు వారసుడు అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా లో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ పోస్టర్లు పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయి లో జరుగుతోందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీరిలీజ్ బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయట.


ప్రపంచవ్యాప్తంగా నాన్ థియేట్రికల్ గా అలాగే థియేట్రికల్ గా ఈ సినిమా 280 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక తెలుగులో కూడా డీల్స్ క్లోజ్ అయితే మొత్తంగా 300 కోట్లకు చేరువయే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఈ కోసం విజయ్ ఏకంగా 90కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకున్నారట. మొత్తంగా ఈ సినిమాకు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందట. ఈ సినిమాను వంశీ తన స్టైల్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కికిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అందుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: