మెగాస్టార్
చిరంజీవి తన వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఆయన హీరోగా నటించిన రెండు సినిమాలు ఈ ఏడాది విడుదల అయ్యాయి. ఇప్పుడు మరొక సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాను ఆయన సంక్రాంతికి విడుదల చేయబోతున్నాడు. ఆ విధంగా ఈ
మెగాస్టార్ చిరంజీవి వచే ఏడాది కూడా రెండు సినిమాలను విడుదలకు సిద్ధం చేయడం విశేషం.
అయితే ఈ
సినిమా కంటే ముందే
మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న
శంకర్ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశాడు. కానీ
చిరంజీవి గత రెండు సినిమాల ఫలితాలు ఆశించిన మేరకు రాకపోవడంతో తాను నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాను ముందుగా విడుదల చేయాలని భావించాడు. అందుకే బోలాశంకర్
సినిమా విడుదలను ఆపేశాడు. అయితే ఆయన ఈ విధంగా చేయడానికి కారణం లేకపోలేదట.
దసరా సందర్భంగా విడుదలైన
గాడ్ ఫాదర్ చిత్రం
రీమేక్ సినిమా అన్న విషయం తెలిసిందే.
అయితే అది ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. దాంతో వెంటనే మరో
రీమేక్ సినిమా రిలీజ్ చేయడం కాదని భావించాడో ఏమో
చిరంజీవి తాను డైరెక్ట్ కథగా చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాను విడుదల చేస్తున్నాడు. ఆ విధంగా ఈ
సినిమా మంచి విజయం సాధిస్తుంది అని నమ్మకంతో ఉంటున్న వేళ ఏ స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక భోళా
శంకర్ సినిమాను వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ
సినిమా లో
కీర్తి సురేష్ చిరు కి చెల్లెలుగా నటిస్తుంది. ఇక ఈ సినిమాల తర్వాత కూడా
చిరంజీవి మరికొన్ని సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు
యువ దర్శకులతో సినిమాలు చేయడానికి అయన రంగం సిద్ధం చేశారు. త్వరలోనే అవి మొదలు కాబోతున్నాయి.