పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలో మరోవైపు రాజకీయాలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న ఓజి సినిమా కోసం ఫాన్స్ మరియు సినీ ఆడియన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరపిక్కబోతున్న ఈ సినిమాకి సంబంధించిన వర్కింగ్ గ్లిమ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎప్పటినుండో తమ అభిమాన హీరోని ఎలా అయితే చూడాలని అనుకున్నారో అలాగే ఈ సినిమాలో చూడబోతున్నందుకు చాలా ఖుషి అవుతున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నాడు.

 చివరిగా ఆయన అంత స్టైలిష్ గా కనిపించింది పంజా సినిమాలొనే. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మరియు లవర్ బాయ్ గా కనిపించాడు. ఇంత స్టైలిష్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో కూడా కనిపించింది లేదు .ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా జరుగుతుంది. ఇదివరకే ముంబై మరియు పూణేలో ఈ సినిమాకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేశారు చిత్ర బృందం .అయితే ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక అరుణ్ మోహన్ ఖరారు అయింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన మొదటి రెండు షెడ్యూల్స్ లో పాల్గొన్న ఈమె ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్న మూడవ షెడ్యూల్ షూటింగ్లో సైతం పాల్గొంటుంది. 

 త్వరగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది .అయితే ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడు పాత్రలో ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట చిత్ర బంధం .ఇక వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవు కానీ.. టైగర్ ష్రాఫ్ లేదా రణవీర్ సింగ్ లేదా ఆయుష్మాన్ ని మెయిన్ విలన్  గా తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా సోషల్ మీడియా వేదిక గా విడుదల చేయనున్నారట  చిత్ర బృందం. ఒకవేళ ఇదే గనుక జరిగితే ఈ సినిమాకి బాలీవుడ్ లో సైతం సెన్సేషనల్ ఓపెనింగ్ వస్తాయని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: